హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జనవరి, ఫిబ్రవరిలో విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 21 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి నర్సాపూర్కు 07631/07632 అనే నంబర్ గల రైలును నడుపుతున్నట్లు వివరించారు. ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 25 వరకు విజయవాడ నుంచి నాగర్సోల్కు 07698/07699 అనే నంబర్ గల ప్రత్యేక రైలును, 21 నుంచి ఫిబ్రవరి 28 వరకు లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్కు 07445/07446 అనే నంబర్ గల రైలును నడుపుతున్నామని వివరించారు.
జనవరి 22 నుంచి ఫిబ్రవరి 26 వరకు 07185/07186 అనే నంబర్గల ప్రత్యేక రైలు మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు నడుపుతున్నామని అన్నారు.ఈనెల 19 నుంచి ఫిబ్రవరి 28 వరకు 07067/07068 మచిలిపట్నం నుంచి కర్నూలు వరకు , ఈనెల 18 నుంచి ఫిబ్రవరి 28 వరకు 07095/07096 అనే రైలును మచిలీ పట్నం నుంచి తిరుపతి వరకు నడుపుతున్నామని రైల్వే అధికారులు వివరించారు.