తిరుపతి: టిటిడి స్థానిక ఆలయాలు శ్రీ కోదండరామాలయం,శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో జరుగనున్న ఉత్సవాలు ఇలా ఉన్నాయి. శ్రీ కోదండరామాలయంలో ఫిబ్రవరి 5, 12, 19, 26వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, రాత్రి 7 గంటలకు ఊంజల్సేవ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 8న ఏకాంతంగా రథసప్తమి. ఈ సందర్భంగా ఉదయం7గంటలకు సూర్యప్రభ వాహనం,రాత్రి7గంటలకు చంద్రప్రభ వాహనం. ఫిబ్రవరి 14న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం11గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం, సాయంత్రం 6.30గంటలకు రామచంద్ర పుష్కరిణి వద్ద ఊంజల్ సేవ జరుగనున్నాయి.
ఫిబ్రవరి 16న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం, సాయంత్రం 6.30 గంటలకు రామచంద్ర పుష్కరిణి వద్ద ఆస్థానం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 17న కూపుచంద్రపేట ఉత్సవం. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 1 నుంచి 24వ తేదీ వరకు అధ్యయ నోత్సవాలు, ఫిబ్రవరి 8న ఏకాంతంగా రథసప్తమి, అంతేకాకుండా ఫిబ్రవరి 10 నుంచి16వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17న ప్రణయ కలహ మహోత్సవం నిర్వహించనున్నారు.