తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువబడుతున్న తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వివరించారు. ఆగస్టు 4న చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం. ఆగస్టు 7న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
9న గరుడ పంచమి (Garuda pandchami) , తిరుమల శ్రీవారి గరుడ సేవ, 10న కల్కి జయంతి. 13న తరిగొండ వెంగమాంబ వర్ధంతి, 14న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం(Indipendence day), స్మార్త ఏకాదశిని జరుపుతున్నామని వివరించారు.
15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు, 16న వరలక్ష్మీ వ్రతం, నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం, 19న శ్రావణపౌర్ణమి, పౌర్ణమి గరుడ సేవ, రాఖీ పండుగ, హయగ్రీవ జయంతి, విఖనస మహాముని జయంతి జరుపుతున్నామని వివరించారు. 20నతిరుమల శ్రీవారు విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపు, గాయత్రీ జపం, 27న శ్రీకృష్ణాష్టమి, తిరుమల శ్రీవారి ఆస్థానం, 28న శ్రీవారి శిక్యోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.