అమరావతి : దసరా ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఏపీ ఆర్టీసీ సంస్థ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలకు 4,100 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ప్రత్యేక బస్సుల్లో 50శాతం ఛార్జీలు ఉండవని ఆర్టీసీ ఎండీ వెల్లడించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఇతర ప్రాంతాలకు ప్రయోగాత్మకంగా సరికొత్త విధానంలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వివరించారు.
ఈ కొత్తవిధానం బాగుంటే కొనసాగిస్తామని లేకుంటే పాతవిధానానే అమలు చేస్తామని అన్నారు. ప్రయాణి కు లు ఫిర్యాదులు, సలహాల కోసం 24 గంటల కాల్సెంటర్ను నెలకొల్పుతున్నామని ఎండీ తెలిపారు. ప్రయా ణికులు 0866 2570005 అనే నంబర్కు ఫొన్ కాల్ చేసి సలహాలు, సూచనలు అందించవచ్చని అన్నారు. దసరా నాటికి ‘స్టార్ లైనర్’ పేరుతో 62 నాన్ ఏసీ స్లీపర్ సర్వీస్లు తీసుకువచ్చేందుకు నిర్ణయించామని పేర్కొన్నారు.