అమరావతి : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏపీలోని శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నామని ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈరోజు గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆయన పర్యటించారు. ఏపీ వ్యాప్తంగా 96 ప్రముఖ శైవ క్షేత్రాలకు 3200 బస్సులు, కోటప్పకొండ తిరునాళ్ళకి జిల్లా నలుమూలల నుంచి 410 బస్సులు అందుబాటులో ఉంచుతున్నామని ప్రకటించారు.
భక్తులు సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.