అమరావతి : సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక బస్సులు నడుపుతుంది. 50శాతం ఎక్స్ట్రా ఛార్జీలతో 1266 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులకు ప్రత్యేక బస్సుల్లో టికెట్ రిజర్షేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది . జనవరి 7 నుంచి 17 వరకు స్పెషల్ బస్సులను వివిధ రూట్లలో నడుపుతామని అధికారులు ప్రకటించారు.
విజయవాడ నుంచి హైదరాబాద్కు 362 బస్సులు, బెంగళూరుకు 14, చెన్నైకు 20 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని వెల్లడించారు. విజయవాడ నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరానికి 390 బస్సులు, విజయవాడ రాజమహేంద్రవరం మధ్య 360 బస్సులు.. ఇతర ప్రాంతాలకు 120 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు.