శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియటంతో శనివారం నుంచి అంటే మార్చి 5 నుంచి శ్రీ మల్లికార్జున స్వామివారి స్పర్శ దర్శనాలు పున:ప్రారంభం కానున్నాయని ఈవో లవన్న తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 4 వరకు ఆలయంలో జరిగే ఆర్జిత సేవలతో పాటు పూర్తిగా నిలిపివేసిన పరోక్ష సేవలు కూడా శనివారం నుండి యధాతథంగా జరుగుతాయని ఈవో చెప్పారు. శనివారం అక్కమహాదేవి అలంకార మండపంలో హుండి లెక్కింపు కారణంగా సామూహికాభిషేకాలను మాత్రం ఆదివారం నుండి ప్రారంభించనున్నారు. ఆర్జిత, పరోక్షసేవ, బ్రేక్ దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. భక్తులు ఆలయ విశేషాలను తెలుసుకునేందుకు కాల్సెంటర్ నెంబర్ 8333901351,52,53,54,55,56 లేదా srisailamonline.com ద్వారా సమాచారాన్ని పొందొచ్చని ఈవో అన్నారు.