అమరావతి : కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం కొడిగాని పల్లికి చెందిన ఓ నిరుపేద మహిళకు సినీ నటుడు సోనూసూద్ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ను అందించి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ను సోనూసూద్ ఫౌండేషన్ సభ్యుడు పురుషోత్తం గురువారం మహిళకు అందించారు. 49 ఏళ్ల వెంకటలక్ష్మి కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె భర్త వెంకటప్ప కొన్నేళ్ల క్రితం చనిపోయాడు.
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఆమెకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అవసరం అయింది. ఈ విషయం గుడుపల్లి మండలానికి చెందిన సోనూసూద్ ఫౌండేషన్ సభ్యుడు పురుషోత్తంకు తెలిసింది. దీంతో ఆయన వెంకటలక్ష్మీ పరిస్థితిని నటుడు సోనూ సూద్ కు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే నటుడు పురుషోత్తంకు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ను పంపగా, ఆయన దానిని వెంకటలక్ష్మికి అందజేశారు.