అమరావతి : కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కలిసి వైఎస్ జగన్ (YS Jagan) పై అక్రమ కేసులు బనాయించి 16 నెలల పాటు జైల్లో ఉంచారని ఏపీ మంత్రులు అంబటి రాంబాబు(Ministers Ambati Rambabu) , రజిని(Rajini) పేర్కొన్నారు. ఏపీలోని గుంటూరు జిల్లాలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ విభాగం ఆత్మీయ సమావేశంలో మంత్రులు పాల్గొని మాట్లాడారు.
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు 52 రోజులు ఉంటేనే ఆ పార్టీ నేతలు గగ్గోలు పెట్టారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలిసి పోటీ చేసినా వైఎస్ జగన్ గెలుపును అడ్డుకోలేరని ధీమాను వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు పదవులు వస్తాయని , కాసింత ఓపిక పట్టాలని సూచించారు. న్యాయవాదులకు సీఎం జగన్ పూర్తి స్థాయిలో గుర్తింపు ఇచ్చారని , జూనియర్ న్యాయవాదుల కోసం లా నేస్త పథకాన్ని అమలు చేస్తూ ఆర్థిక సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు.