ప్రకాశం: ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. జిల్లాలోని మార్కాపురం మండలం రాయవరం కనకదుర్గమ్మ కాలనీలో పెండ్లి చేయలేదనే నెపంతో తండ్రిని కుమారుడు హత్య చేశాడు. బాలాభద్రాచారి తన కుటుంబంతో కలిసి కనకదుర్మక కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు గురునారాయణ అనే కుమారుడు ఉన్నాడు. శనివారం తెల్లవారుజామున తండ్రిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన గురునారాయణ.. తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి చంపాడు.
అనంతరం తానుకూడా గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు అతడిని దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలనికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.