తిరుపతి: తిరుపతిలో నిర్వహించదలిచిన అమరావతి రైతుల బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ముగింపు సభను ఇండోర్గా సభ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. 17న ఏపీలోని 175 నియోజకవర్గాల్లో సంఘీభావ సభలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో టీడీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాల, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం(తిరుపతి) వరకు చేపట్టిన మహాపాదయాత్ర శనివారం 41వ రోజుకు చేరుకుంది.