అమరావతి : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పాము సంచారం కలకలం రేపింది . ఆస్పత్రి ఎక్స్రే గదిలో పాము కనిపించడంతో వైద్యులు, సిబ్బంది, రోగులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పామును పట్టే వ్యక్తిని పిలిపించారు. అతడు పామును పట్టుకుని దూరప్రాంతంలో వదిలివేశారు.
ఆస్పత్రి పరిసర ప్రాంతాలు ముళ్ల పొదలతో పేరుకుపోవడంతో తరుచూ విషపురుగులు ఆస్పత్రిలోకి ప్రవేశిస్తున్నాయని రోగులు వెల్లడించారు. ఆస్పత్రికి ప్రతిరోజూ మూడు వందల మంది రోగులు, వారి బంధువులు వస్తుంటారని అటువంటి ఆస్పత్రిలో విషపురుగుల సంచారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.