తిరుపతి : ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం తిరుపతి స్టేషన్లో ఆగి ఉన్న తిరుమల ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటినా బోగి వద్దకు వెళ్లి పొగలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాల గురించి ఆరా తీశారు. ఈ ఘటనతో ఎలాంటి ప్రమాదం లేదన్న అధికారులు యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగించారు.