అమరావతి : యువకుడు ఆత్మహత్యకు కారణమంటూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐను సస్పెన్షన్ చేశారు. ఏపీలోని కృష్ణా జిల్లా రపూడితండా వాసి బాలాజీ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. నాటుసారా కేసు విచారణ పేరుతో బాలాజీని ఎ. కొండూరు ఎస్ఐ టి. శ్రీనివాస్ స్టేషన్కు తీసుకొచ్చి విపరీతంగా కొట్టారు. తీవ్ర మనస్తాపానికి గురైన బాలాజీ ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులో శవమై కనిపించాడు.
పోలీసుల చిత్ర హింస వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మృతదేహంతో బంధువులు, గ్రామస్థులు రహదారిపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులపై చర్యలు తీసుకునేంత వరకు శవాన్ని ఇక్కడి నుంచి కదిలించేది లేదని ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐ శ్రీనివాస్తో పాటు మైలవరం సీఐ రమేశ్పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.