అమరావతి : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మాదక ద్రవ్యాలను అరికట్టాలని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడును కోరారు. గురువారం ఎస్పీని కలిసిన ఆయన తిరుపతిలో యువకులు మాదకద్రవ్యాలు వాడుతున్నారని లిఖిత పూర్వక ఫిర్యాదు అందజేశారు.
నగరంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని పేర్కొన్నారు. డ్రగ్స్కు బానిసలై యువకులు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో గంజాయి అమ్మకాలను అరికట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ మేరకు మూడు పేజీల ఫిర్యాదుని ఎస్పీ అప్పలనాయుడికి అందజేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.