అమరావతి : ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు, ఏకపక్ష నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర జలశక్తి మంద్రి గజేంద్ర సింగ్ షెకావత్కు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతుందడడం వల్ల సాంకేతికంగా నష్టం జరిగిందని అన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పనులు మరో ఏజెన్సీకి అప్పగించారని తెలిపారు.
ఆకస్మికంగా పనుల నిలిపివేతతో కొత్త ఏజెన్సీ పనులకు ఆరు నెలల సమయం పట్టిందని పేర్కొన్నారు. పనులు సకాలంలో ప్రారంభించక పోవడంతో డయాఫ్రం వాల్ దెబ్బతిందని అందుకు వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపలేదని అన్నారు. లేఖతో పాటు పీపీఏ మినిట్స్, కేంద్రం చేసిన సూచనల కాపీలను ఆయన జతచేశారు.
ప్రాజెక్టు నష్టం పునరుద్ధరణకు రూ. 800 కోట్లు ఆదనంగా అవసరమని వెల్లడించారు. పోలవరం సత్వర పూర్తికి సహకరించాలని లేఖలో కేంద్ర మంత్రిని కోరారు.