(Swarnabharat Trust) నెల్లూరు : వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తదితరులు హాజరై ట్రస్ట్ సేవలను కొనియాడారు. యువతకు దిశానిర్దేశం చేశారు. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా వెంకటాచలంలో ప్రారంభమైన స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యకలాపాలను ప్రస్తుతం ఆయన కుమార్తె దీపా వెంకట్ చూస్తున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. మాతృభాషను, మాతృభూమిని ఏనాడూ మరువొద్దని, తెలుగు భాష పరిరక్షణ కోసం స్వర్ణభారత్ ట్రస్టు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చిన వెంకయ్యనాయుడు.. సేవే తన అభిమతమని, సేవే అసలైన మతమని ప్రగాఢంగా విశ్వసిస్తానని చెప్పారు. సేవా సంస్థలను ప్రోత్సహిస్తారనే నమ్మకంతోనే పలువురిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో.. అంతే పుణ్యం సేవాలయానికి వెళ్తే దొరుకుతుందన్నారు. గ్రామీణ యువతే దేశానికి ఆశాకిరణాలని చెప్పిన ఆయన.. యువతకు శిక్షణ ఇచ్చి సొంతకాళ్లపై నిలబడేలా చేయాలని సూచించారు. గ్రామీణ మహిళలు, దివ్యాంగుల్లోని ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇస్తుండటం అభినందనీయమని ఉపరాష్ట్రపతి తెలిపారు.
స్వర్ణభారత్ ట్రస్ట్ 20 వ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రసంగించారు. గతంలో సిఫార్సుల మేరకే పద్మ పురస్కారాలు దక్కగా.. మా పాలనలో ప్రతిభ, సేవతోనే పురస్కారాలకు ఎంపికవుతున్నారని, కనీసం కాళ్లకు చెప్పులు లేని అతి సామాన్యులు రాష్ట్రపతి భవన్కు వచ్చి పద్మ అవార్డులు స్వీకరిస్తుండటం వారి సేవలకు గుర్తింపు అని కొనియాడారు. నిత్యం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే వెంకయ్యనాయుడు.. ఎన్నో పదవులకు వన్నె తెచ్చారని ప్రశంసించారు. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో వెంకయ్య కృషి అనన్యసామాన్యమైనదని, ఎన్నో ఉన్నత స్థాయి చర్చల్లో చురుకుగా పాల్గొన్నారని కితాబిచ్చారు.
చరిత్రలో ఈరోజు : చందమామపై పరిశోధనలో భారత్ సువర్ణధ్యాయం
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..