అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఉద్యోగులకు రెండురోజులపాటు కొవాగ్జిన్ రెండోడోసు టీకా వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ, రేపు ఉద్యోగులకు టీకాలు వేయనున్నారు. వ్యాక్సినే తీసుకోవాల్సిన వారి జాబితాను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు.
మొదటి డోసు తీసుకున్న రోజును పరిగణనలోకి తీసుకొని జాబితా తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తిరుమల, తిరుపతిలో పనిచేస్తున్నఉద్యోగులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సమాచారం అందిన వారికి హౌసింగ్బోర్డు కాలనీ పరిధిలోని 40వ వార్డు సచివాలయంలో టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.