తిరుపతి : పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగంలో భాగంగా మూడో రోజైన ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా జప తర్పణ హోమాలు నిర్వహించారు. ఈ యాగం జూలై 24వ తేదీ వరకు ఆన్లైన్ వర్చువల్ విధానంలో నిర్వహించనున్నారు. ఇందులో బాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు ఆలయంలోని శ్రీ కృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారిని వేంచేపు చేశారు.
టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో 210 మంది రుత్వికులు చతుష్టార్చన, కోటి కుంకుమార్చనలో ఒక ఆవర్తి, హోమం, లఘుపూర్ణాహుతి నిర్వహించారు.
ఇందులో ప్రధానంగా 120 మంది కోటి అర్చన, 36 మంది హోమం, 12 మంది శ్రీ భాష్యం, రామాయణం, భాగవతం, మహాభారతం పారాయణం, 12 మంది జపం, 12 మంది ఆవు పాలతో తర్పణం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కస్తూరి బాయి, ఏఈవో ప్రభాకర్రెడ్డి, సూపరింటెండెంట్ గోపాలకృష్ణారెడ్డి, శేషగిరి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్, సీపీఐల నుంచి టీఆర్ఎస్లో చేరికలు
గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న పోర్న్ స్టార్
యాదాద్రిలో వైభవంగా స్వాతి నక్షత్ర పూజలు