అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఏపీలో 13 ,తెలంగాణలో రెండు స్థానాలకు మార్చిలో ఎన్నికల నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఏపీలో మూడు పట్టభద్రులు, రెండు టీచర్, 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ను విడుదల చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికలు(8)
అనంతపురం, కడప, నెల్లూరు,
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ,శ్రీకాకుళం,
చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనుంది.
పట్టభద్రుల స్థానాలు(3)
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు కలిపి ఒక స్థానం
కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు కలిపి ఒక స్థానం
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు కలిపి ఒక స్థానం
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు(2)
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు కలిపి ఒక స్థానం
కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి ఉపాధ్యాయ స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ షెడ్యూల్ విడుదలచేసింది. వీటికి సంబంధించి ఈనెల 16న నోటిఫికేషన్ విడుదల చేసి మార్చి 13న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని వెల్లడించింది. మార్చి 29తో ఎమ్మెల్సీల పదవీకాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది.