తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 79,370 మంది భక్తులు దర్శించుకోగా 39,199 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.25 కోట్లు వచ్చిందని వివరించారు.