శ్రీశైలం: శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు నేడు మూడోరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు విశేషపూజలు నిర్వహించారు. తెల్లవారుజామున గంగాధర మండపం వద్ద భోగిమంటల వేశారు. భోగి సందర్భంగా చిన్నారులకు సామూహిక బోగిపండ్ల కార్యక్రమం, సాయంత్రం స్వామి, అమ్మవార్లకు రావణ వాహనసేవ, ఆలయప్రాకారోత్సవం నిర్వహించనున్నారు.
రేపు ఉదయం మహిళలకు దక్షిణ మాడవీధిలో ( శివవీధిలో) ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం జరగనున్నది. 16వ తేదీన కనుమ పండుగ రోజున సంప్రదాయబద్దంగా గో పూజ ,17వ తేదీన వేదశ్రవణం కార్యక్రమం ఉంటుంది.