Tirumala | తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న భక్తురాలిని పాము కాటేసింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన తిరుమలలో కలకలం రేపింది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 దర్శనం క్యూలైన్లో ఉన్న తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన భక్తురాలు మౌనిక (27)ను పాము కాటేసింది. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ సిబ్బంది తక్షణమే స్పందించి.. భక్తురాలిని అశ్విని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం.. మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుత ెలిపారు.