అమరావతి : నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసిన ఏపీలోని ఓ దవాఖానకు అధికారులు భారీగా జరిమానా విధించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సాయిసుధా దవాఖాన కొవిడ్ బాధితుడి నుంచి చికిత్సకు రూ. 14లక్షలు వసూలు చేసిందని అధికారులు ఫిర్యాదు అందింది. దీంతో విచారణ చేసిన అధికారులు దవాఖాన యాజమాన్యానికి రూ.75.80 లక్షల జరిమానా విధించడంతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కాగా దవాఖాన యాజమాన్యం కలెక్టర్ సమక్షంలో బాధితులకు రూ.10.84 లక్షలు చెల్లించినట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.