అమరావతి : అమరావతి : కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. శిరివెళ్ల నుంచి రుద్రవరం రహదారిలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కోగా ఈ ప్రమాదం జరిగింది. నంద్యాల మండలం మిట్నాల గ్రామానికి చెందిన సుమారు 15 మంది కూలీ పనులకు ఆటోలో వెళ్తుండగా ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి.
గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హుటాహుటిన నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులు రుద్రవరం మండలం చిన్నకంబళూరు వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.