అమరావతి : శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం బట్రాయిపల్లె వద్ద కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడ్డ ఐదుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది . బాధితులను కదిరి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని బెంగళూరుకు తరలించారు. ప్రమాదానికి గురైన వారు కదిరి పట్టణానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
పులివెందు ల నుంచి శిల్పారామం సందర్శనానికి వెళ్తున కారును పులివెందుల నుంచి కదిరికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.