అమరావతి : ఏపీ ప్రభుత్వం చేసినా అప్పులన్నీ(Debt) తీరుస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) హామీ ఇచ్చారు. తనను, తన పార్టీని గెలిపిస్తే రూ. 50 లక్షల కోట్లను తీసుకొచ్చి ఏపీ అప్పుగా ఉన్న రూ.10 లక్షల కోట్లను తీరుస్తానని పేర్కొన్నారు. రూ.5లక్షల కోట్లు అప్పుచేసినా జగన్(Jagan) కావాలా? అధికారికంగా రూ. 5 లక్షల కోట్లను దానం చేసిన కేఏ పాల్ కావాలా? ఏపీ ప్రజలు తేల్చుకోవాలని కోరారు.
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ మోదాని, అంబానీలను మిలినియర్లను చేసిందని, మోదీ వచ్చిన తరువాత వారు దేశాన్ని అమ్మేశారని ఆరోపించారు. విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నానని, ఎమ్మెల్యేగా కూడా ఎస్. శృంగావరపు కోట నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నానని తెలిపారు. నా అనుచరులు పిఠాపురం(Pitapuram) నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) కు భారతరత్న ఇవ్వాలని గత పది సంవత్సరాలుగా కేంద్రాన్ని అడుగుతున్నానని, అది సాధించేంతరకు నిద్రపోనని అన్నారు.