అమరావతి : ఏపీలోని కాకినాడలో ఓ రౌడిషీటర్ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో అగంతుకులు ఇద్దరిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో రౌడిషీటర్ జగదీశ్ మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతదేహాన్ని జీజీహెచ్ కు తరలించారు. జగదీశ్పై గతంలో పలు కేసులు నమోదయ్యాయి.
ఒకటో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడి జరగటానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.