అమరావతి : విధులో ఉన్న ఆర్టీవోను టిప్పర్ ఢీ కొగా ఆయనతో పాటు మరొకరు మృతి చెందిన ఘటన వైఎస్సార్ జిల్లా(YSR District)లో చోటు చేసుకుంది. జిల్లాలోని అలంఖాన్పల్లె వద్ద శనివారం ఆర్టీవో(RTO) శివప్రసాద్, సిబ్బంది కేశవతో పాటు మరికొందరు విధులు నిర్వహిస్తున్నారు.
వేగంగా వచ్చిన ఓ టిప్పర్ వీరిని ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.