అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రెండు జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదంలో మొత్తం ఐదుగురు దుర్మరణం చెందారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం ఇప్పట్లలో ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో పులివెందులకు చెందిన ముగ్గురు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం తాడంకి పైవంతెన వద్ద ఆగి ఉన్న టిప్పర్ను హైదరాబాద్ నుంచి యానాం వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36మంది ప్రయాణికులు ఉన్నారు. సంఘటనపై పమిడిముక్కల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.