అమరావతి : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు కర్నూలు( Kurnool Residents ) జిల్లా రైతులు దుర్మరణం చెందారు. దావణగెరి వద్ద టెంపో వాహనం టైర్ పంక్చరు(Tyre Punture) కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం నాగలాపురానికి చెందిన మిర్చి రైతులు పెద్దవెంకన్న, మస్తాన్, మంత్రాలయం మండలం శింగరాజనహల్లికి చెందిన ఈరన్న అక్కడికక్కడే మృతి చెందారు.
మిర్చి లోడ్తో టెంపోలో బ్యాడిగి మార్కెట్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.