అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా (Palnadu District) చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) ముగ్గురు మృతి చెందారు. మరో 14 మందికి గాయాలుకావడంతో ఆస్పత్రికి తరలించారు.
చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన 15 మంది వ్యవసాయ కూలీలు నాదెండ్ల మండలం అప్పాపురంలో మిర్చి కోతలకు ఆటోలో వస్తుండగా ప్రమాదవశాత్తు ఆటో రోడ్డు మధ్యలోకి రావడంతో ఎదురుగా వస్తున్న మాచర్ల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు (RTC Bus) ఆటో ను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న యాకసిరి హనుమాయమ్మ(60) అక్కడికక్కడే మృతి చెందగా, మరో 14 మందికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో గన్నవరపు శివపార్వతి(58), షేక్ హజరత్ వలీ (65) చికిత్స పొందుతూ చనిపోయారని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు.