అమరావతి : ఏపీలోని ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఏలూరు నుంచి గుడివాడకు వెళ్తున్న కారు జాతీయ రహదారిపై ప్రమాదం అదుపుతప్పి డివైడర్ను ఢీ కొంది. కారులో ఉన్న శారద ( 66), డ్రైవర్ శ్రీను (45) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు . కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.