అమరావతి : ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఏపీలోని మూడు జిల్లాలకు చెందిన ఎస్పీలు రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) ఎదుట హాజరయ్యారు. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డి, పల్నాడు జిల్లా రవిశంకర్రెడ్డి, నంద్యాల జిల్లా కె. రఘువీరారెడ్డి సీఈవో ముకేశ్ కుమార్ మీనా (CEO Mukesh kumar Meena)ఎదుట గురువారం హాజరయ్యారు.
గిద్దలూరు, ఆళ్లగడ్డలో రాజకీయల కారణంగా ఇద్దరు హత్యకు గురికాగా, మాచర్లలో వాహనం తగలబెట్టారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడి ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత కూడా పోలీసులు శాంతి భద్రతల విషయంలో నిర్లక్ష్యంపై ఎస్పీలను ప్రశ్నించారు. ముగ్గురు ఎస్పీ లు ఇచ్చిన వివరణలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకునే అవకాశముంది .