అమరావతి : తిరుపతి సహకార టౌన్ బ్యాంక్కు రీ పోలింగ్ నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. ఇవాళ జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. నకిలీ ఐడీకార్డులతో అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ నాయకులను ప్రశ్నించిన టీడీపీ వారిని పోలీసులు అరెస్టు చేయడం దారుణమని అన్నారు.
వెంటనే ఎన్నికల్లో అక్రమాలను నివారించాలని వెల్లడించారు. ఓటర్లు పోలింగ్లో పాల్గొనకుండా పోలీసులు నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఎన్నికల్లో అక్రమాలపై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అనధికారిక నిర్బంధం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని వారు వివరించారు. పోటీలో ఉన్న వారికీ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు.
నిర్బంధిం చేందుకు కారణం చెప్పలేదని, నోటీసులూ ఇవ్వలేదని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుని పౌరహక్కులను రక్షించాలని సీజేను కోరారు.