ReNew Power | ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. ఇంధన రంగంలో రెన్యూ పవర్ సంస్థ రూ.82 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకుంది.
ఈడీబీతో రూ.60 వేల కోట్ల విలువైన నాలుగు ఎంవోయూలు కుదుర్చుకుంది. ఇవికాకుండా గతంలోనే రూ.22వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. పునరుత్పాదక శక్తి, సోలార్ తయారీ, బ్యాటరీ స్టోరేజీ, పంప్డ్ హైడ్రో, గ్రీన్ అమ్మోనియా రంగంలో పెట్టుబడులు పెడుతున్నట్లు రెన్యూ పవర్ సంస్థ తెలిపింది. ఒప్పందంలో భాగంగా 6GW PV ఇంగోట్ వేఫర్ ప్లాంట్, 2 GW పంప్డ్ హైడ్రో ప్రాజెక్టు, 300 KTPA గ్రీన్ అమ్మోనియా సౌకర్యం, విండ్, సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ వంటి వాటిల్లో 5GW హైబ్రిడ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. తాజా ఎంవోయయూల ద్వారా 10వేలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.