అమరావతి : కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం మాధవరంలో ప్రేమ వివాహం ఉద్రిక్తత దారితీసింది. గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమించుకున్నారు. యువతి పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించ ఆమెకు మరో యువకుడితో వివాహం చేశారు. కొద్దిరోజులకే ఆమె ప్రియుడుతో ఊరి నుంచి వెళ్లిపోయింది. ఆగ్రహించిన యువతి కుటుంబ సభ్యులు ప్రియుడి ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు.
దీంతో భయంతో అతడి కుటుంబ సభ్యులు గ్రామం నుంచి పారిపోయారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బందోబస్తును ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడ్డ ప్రియురాలి బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.