తిరుమల : తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ తగ్గింది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 76,291 మంది భక్తులు దర్శించుకోగా 28,495 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ. 3.14 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
వైభవంగా వేణుగోపాలుడి రథోత్సవం
తిరుపతి : కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా రథోత్సవాన్ని నిర్వహించారు.