Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునస్వామిఅమ్మవార్లు పుర వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చేందుకు బంగారు రథాన్ని బంగారు రథాన్ని బహూకరించారు. నెల్లూరుకు చెందిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి- ప్రశాంతిరెడ్డి దంపతులు శుక్రవారం శాస్త్రోక్త పూజలు నిర్వహించి శ్రీశైల దేవస్థానానికి రథాన్ని విరాళంగా అందించారు.
శుక్రవారం మహాకుంభాభిషేక ప్రారంభోత్సవం అనంతరం రథసప్తమి సందర్బంగా ఆలయ రాజగోపురం వద్ద స్వర్ణ రథానికి సంప్రోక్షణ, ప్రారంభపూజలు చేసి రథాంగహోమం, రథాంగబలి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సంప్రోక్షణ పూజలు పూర్తిచేసుకుని గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం జరిపించారు. ఆలయ ప్రధాన వీధిలో జరిగిన రథోత్సవంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ చక్రపాణిరెడ్డితోపాటు ఆలయ ఈవో అధికారులు, సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు.