(Raga Rasagnya) తిరుపతి: రాగ రసజ్ఞ నాలుగో వార్షిక సంగీతోత్సవాలు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఎన్ఎస్యూ క్యాంపస్లో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (ఎన్ఎస్యు) సహకారంతో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం ముఖ్యఅతిథుల ఆవాహన, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి.
కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టడానికి ఈ రకమైన ఆధ్యాత్మిక సంగీత ఆధారిత కార్యక్రమాలు అవసరమని ఎన్ఎస్యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వీ మురళీధర శర్మ అన్నారు. తొలి రోజు కార్యక్రమంలో భాగంగా విజయవాడకు చెందిన గాత్ర యుగళగీతం మల్లాది సోదరులు ప్రదర్శించగా.. మృదంగంలో వంకాయల రమణమూర్తి, ఘటంపై ఎం హరిబాబు సహకారం అందించారు. కార్యక్రమంలో ప్రముఖ మృదంగం, వయోలిన్ కళాకారులు వీ కమలాకరరావు, డాక్టర్ కొమండూరి శేషాద్రి, రాగ రసజ్ఞ నిర్వాహకులు రామకుమార్, హేమ సుధ, శ్రద్యుత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..