తిరుమల: టిటిడి దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమలలో గత మూడురోజుల నుంచి జరుగుతున్న కన్నడ సంగీత పితామహుడు పురందరదాసు ఆరాధన మహోత్సవాలు బుధవారం ముగిశాయి. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ మానవ జీవన విధానంలో ఎదురయ్యే సమస్యలకు పూర్వజన్మ కర్మ ఫలమే కారణమన్నారు. దీని నుంచి బయట పడటానికి మహత్ములను సందర్శించి వారి మార్గదర్శకత్వంలో భగవంతుడిని సేవించడం ద్వారా మోక్షం పొందవచ్చని తెలిపారు.
శ్రీ పురందరదాసులవారు జీవితకాలంలో 4.75 లక్షల సంకీర్తనలు రచించడం దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు నారద స్వరూపులైన శ్రీపురందరదాసుకే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. పురందరదాసు కీర్తనలు యావత్తూ లోకోక్తులేనన్నారు. మానవాళికి పురందరదాసు జీవితసారమే ఆదర్శప్రాయమన్నారు.