తిరుమల : సమాజం నుంచి అంగవైకల్యాన్ని పారద్రోలేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పల్స్పోలియోను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి్ (TTD EO Dharma reddy) పిలుపునిచ్చారు. ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన పల్స్పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పల్స్పోలియో కార్యక్రమంలో భక్తులు, స్థానికులు 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు విధిగా పల్స్పోలియో చుక్కలు వేయించాలని కోరారు. రెండు చుక్కలు చిన్నారుల జీవితాలకు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు.