అమరావతి : సముద్రంలోకి వ్యర్ధాలకు విడుదల చేయవద్దని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో వందలాది మత్స్యకారులు (Fishermens) రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. కాలుష్య పరిశ్రమల నుంచి వ్యర్థాలను విడిచిపెట్టేందుకు సముద్రంలో వేసిన పైపులైన్లను తొలగించాలని రోడ్డుపై ఉన్న బోటును తగలబెట్టారు(Boat Burnt). ఆందోళనకారులు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
పోలీసులు అక్కడికి వెళ్లి నిరసనకారులతో మాట్లాడి వారికి నచ్చచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. వ్యర్థాలు సముద్రంలోకి వదలడం వల్ల మత్స్య సంపద తగ్గిపోయే ప్రమాదం ఉందని, దీంతో తమకు జీవనోపాధిని కోల్పోయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలోకి పైపులైన్ల ద్వారా వ్యర్థాలను వదలిపెట్టడాన్ని నిరసిస్తూ గత మూడు రోజులుగా మత్స్యకారులు ఆందోళన నిర్వహిస్తున్నారు. పైపులైన్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.