అమరావతి : ఏపీలోని నరసాపురం ఎంపీగా రఘురామరాజు (RRR) కు టికెట్ ఇవ్వాలని ఆయన అభిమానులు ఆందోళన నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని పెద్దమ్మతల్లి ఆలయం ఎదుట ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. బీజేపీలో టికెట్ రాకుండా వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM YS Jagan) అడ్డుపడ్డారని ఆరోపించారు. ఏపీ బీజేపీ(BJP) నాయకులతో జగన్ కుమ్మకై ఆర్ఆర్ఆర్కు టికెట్ రాకుండా చేశారని విమర్శించారు.
ఆర్ఆర్ఆర్ అంటే నియోజకవర్గ ప్రజల్లో్ ఒక ధైర్యం, నమ్మకముందని పేర్కొన్నారు. వైసీపీ(YCP) పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనను అడ్డుకోకపోతే గడ్డు పరిస్థితులు తప్పవన్న భయంతో జగన్ రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్కు వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులు ఆర్ఆర్ఆర్కు పోటీకి అవకాశం ఇవ్వాలని కోరారు.