అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ జీవోలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ మంత్రులు సజ్జల రామకృష్ణరెడ్డి, బొత్స సత్యనారాయణ స్ఫష్టం చేశారు. ఈ రోజు సీఎం జగన్తో ప్రభుత్వ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం కమిటీ సభ్యులైన మంత్రులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి ఎక్కడా సమస్య ఉందో చర్చలకు రమ్మని పిలిచామని అన్నారు.
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఉద్యోగులకు న్యాయం చేశామని అన్నారు. సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వంతో చర్చించేందుకు ముందుకు వస్తే సానుకూల పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు . కమిటీనీ గుర్తించబోమని చెప్పడం ప్రతిష్టంబన పెంచడమేనని పేర్కొన్నారు.