అమరావతి : వైఎస్ఆర్ ప్రీప్రైమరీ పాఠశాలలు పిల్లలకు దగ్గరగా ఉండేలా చూడాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాలలన్నీ మూడు కిలోమీటర్ల దూరంలో చిన్నారులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఉపాధ్యాయుల బోధన సామర్థ్యానికి తగ్గట్టు రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని అన్నారు.
గురువారం విద్యాశాఖ, స్త్రీ-శిశు సంక్షేమశాఖల మధ్య సమన్వయంతోపాటు వైఎస్ఆర్ ప్రీప్రైమరీ పాఠశాలల అంశాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఫౌండేషనల్ స్కూళ్ల తర్వాత డిజిటల్ బోధనపై దృష్టిపెట్టాలని చెప్పారు. ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.