గుంటూరు : (Praja Sankalpa Yatra) ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టి ఇవాల్టికి నాలుగేండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. కేక్ కొశారు. మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం జగన్తోపాటు పాదయాత్రలో పాల్గొన్న పలువురిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హాజరయ్యారు. పాదయాత్రలో తెలుసుకున్న ప్రజల ఇబ్బందులనే మానిఫెస్టోగా మార్చి.. అధికారంలోకి వచ్చాక అమలు చేసి చూపిస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. పరిపాలనా ఫలాలు క్షేత్రస్థాయిలో అందాలన్న లక్ష్యంతోనే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు.
ఏపీలో 341 రోజుల పాటు కొనసాగించిన తన ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేండ్లు పూర్తయిన సందర్భంగా సీఎం జగన్మోహన్రెడ్డి ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ‘ప్రజా సంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేండ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోంది’ అని సీఎం జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు పలు కార్యాక్రమాలను నిర్వహిస్తున్నారు.
రాజధాని తరలింపు నిర్ణయం చారిత్రక తప్పిదం: తులసిరెడ్డి
ప్రభంజనంలా ఏపీ రైతుల మహాపాదయాత్ర
శ్రీవారికి తమిళ భక్తుడి భూరి విరాళం.. 3 కేజీల బంగారు బిస్కెట్లు అందజేత
రేపటి నుంచి పాపికొండలకు బోటు సర్వీసులు
బాలికపై గ్రామ వాలంటీర్ల సామూహిక లైంగికదాడి
పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో చర్చించాలి : ఎంపీ మోపిదేవి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..