అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించి పూర్తిచేస్తామని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. పోలవరం పూర్తవుతుంటే చంద్రబాబుకు కడుపుమంటగా ఉందని ఆరోపించారు. ఈవాళ అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నిర్వాహకం వల్లే పోలవరం పనులు శాపంగా మారాయని పేర్కొన్నారు. ప్రణాళిక లేకుండా చంద్రబాబు ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారని విమర్శించారు.
పోలవరానికి స్పిల్వే నిర్మాణంలో తప్పులు చేశారని వివరించారు. నీటిని మళ్లించడానికి ముందే స్పిల్వే పెట్టాల్సి ఉండగా స్పిల్వే పూర్తి చేయకుండా కాఫర్ డ్యామ్ కట్టారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గిస్తుందని టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారంతో ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తుందని తెలిపారు.