హైదరాబాద్: ప్రధాని మోదీ (PM Modi) నేడు ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో పర్యటించనున్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ప్రధాని.. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు. అటునుంచి హెలీకాప్టర్లో భీమవరం చేరుకుంటారు. భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. సభ తర్వాత ప్రధాని ఢిల్లీకి బయలుదేరుతారు.