అమరావతి : ఈనెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు పోలీసులు అనుమతినిచ్చారు. తాడేపల్లి మండలం ఇప్పటంలో నిర్వహించనున్న సభకు అనుమతి కోరుతూ పది రోజుల క్రితం పోలీసులకు అనుమతి కోరుతూ లేఖను అందజేశారు. పదిరోజులుగా అనుమతి రాకపోవడంతో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రభుత్వ తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించిన కొద్ది గంటల్లోనే పోలీసుల నుంచి అనుమతి వచ్చింది.
సభను విజయవంతం చేసేందుకు 12 కమిటీలను పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. కాగా జనసేన పార్టీ ఆవిర్భావ సభాప్రాంగాణానికి ‘దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక’గా నామకరణం చేశారు. దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.